న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత్లో కరోనా కల్లోలంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘భారత్లో పరిస్థితులు క్షిష్టతరంగా ఉన్నాయని తెలుసు. వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నాం. కరోనాతో ఆప్తులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటాం. ప్రాణాలను కాపాడేందుకు సాధ్యమైనదంతా చేస్తాం. వైరస్ ఎంత వినాశనం సృష్టించగలదో భారత్లోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ప్రజారోగ్య చర్యలు, వ్యాక్సిన్లు, చికిత్సతో వైరస్ను ఎదుర్కోవాల’ని టెడ్రోస్ పేర్కొన్నారు.