ఆరోగ్య సమాజమే లక్ష్యంగా వైద్య సిబ్బంది పని చేయాలి
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
సూర్యాపేట టౌన్, జూలై 15 : పైలేరియా నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. జాతీయ బోదకాలు, నులి పురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రాజీవ్నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య సమాజమే లక్ష్యమని, ఆ దిశగా వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జిల్లా వైద్యాధికారి కోటాచలం పాల్గొన్నారు .
డీఈసీ మాత్రలు వాడాలి డీఎంహెచ్ఓ తిరుమలగిరి బోదకాలు వ్యాధి సోకకుండా ముందు జాగ్రత్తగా డీఈసీ మా త్రలు వాడాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు. తిరుమలగిరిలో మాత్రల పంపిణీని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమం లో డాక్టర్ ప్రశాంత్బాబు, సీహెచ్ఓ బిచ్చునాయక్,మున్సిపల్ వైస్ చైర్మన్ రఘునందన్రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
చివ్వెంల : చివ్వెంల గ్రామపంచాయతీ కార్యలయంలో నట్టల నివారణ మందుల పంపిణీలో అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ మాత్రల పంపిణీ పరిశీలి ంచారు. డీపీఓ యాదయ్య, ఎంపీపీ ధరావత్ కుమారి బాబూనాయక్, తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ జమలారెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ రాజ్కుమార్, ఎంపీఓ గోపి పాల్గొన్నారు.
బోదకాలు రహిత సమాజ స్థాపనకు పాటుపడదాం ఎమ్మెల్యే
కోదాడ రూరల్ : బోదకాలు వ్యాధి రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ నిరంజన్, జిల్లా అసంక్రమిత వ్యాధు ల అధికారి కళ్యాణ్చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణి కూచిపూడిలో మాత్రల పంపిణీని జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి, సర్పంచ్ శెట్టి సురేశ్, ఎంపీటీసీ శంకర్శెట్టి కోటేశ్వరావు, ఎర్రవరంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రావు ప్రారంభించారు.
సూర్యాపేట రూరల్ : మండలంలోని కాసరబాద ఆరోగ్య ఉప కేంద్రంలో ఎంపీపీ బీరవోలు రవీందర్రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం బోదకాలు నివారణ మాత్రల పంపిణీని ప్రారంభించారు. ఎంపీడీఓ శ్రీనివాస్రావు, వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్నాయుడు, వైద్యాధికారి సంధ్య, సర్పంచ్ కొల్లు రేణుక, ఎంపీటీసీ బంటు నాగమ్మ సలీం
మునగాల/మోతె/చిలుకూరు/నడిగూడెం : బోదకాలు, నులి పురుగుల నివారణ కోసం పంపిణీ చేస్తున్న మాత్రలను ప్రతి ఒక్కరూ వేసుకోవాలని రేపాల, మునగాల పీహెచ్సీల వైద్యులు దిలీప్కుమార్, యాదా రమేశ్ అన్నారు. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీని వారు ప్రారంభించారు. మోతె మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఎంపీపీ ముప్పాని ఆశ, జడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు మాత్రల పంపిణీని ప్రారంభించగా, చిలుకూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో ఇంటింటికీ మాత్రలు పంపిణీ చేయగా, నడిగూడెం మండలంలోని తెల్లబల్లిలో త్రిపురవరం పీహెచ్సీ వైద్యురాలు లక్ష్మీప్రసన్న మాత్రల పంపిణీలో పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్/నూతనకల్ : ఆత్మ కూర్. ఎస్ మండలం నెమ్మికల్, నూతనకల్లోఆల్బెండజోల్ మందులను డిప్యూటీ డీఎంహెచ్ఓ హర్షవర్ధన్ పంపిణీ చేశారు. వైద్యాధికారులు డాక్టర్ ఆనంద్కుమార్, త్రివేణి, సీహెచ్ఓలు ఆవుల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
బొడ్రాయిబజార్ : పట్టణంలోని 17వ వార్డులో చింతలపాటి భరత్, 29వ వా ర్డులో అనంతుల యాదగిరి, 45వ వార్డు లో గండూరి పావనీకృపాకర్ మాత్రలు పంపిణీ చేశారు.
అర్వపల్లి : కుంచమర్తి గ్రామంలో డీఈసీ, ఆల్బెండజోల్ మాత్రల పంపిణీని క్షయ వ్యాధి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి నవీన్, సీహెచ్ఓ చరణ్నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నాగారం : పీహెచ్సీలో ఎంపీపీ కూరం మణీవెంకన్న డీఈసీ, ఆల్బెండజోల్ మా త్రలు పంపిణీ చేశారు. గ్రామాల్లో సర్పంచులు చిప్పలపల్లి స్వప్న, కుంభం కరుణాకర్, మల్యాల ఈశ్వరమ్మ పాల్గొన్నారు.
తుంగతుర్తి : ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ గుండగాని కవితారాములుగౌడ్ మాత్రలు పంపిణీ చేశారు. ఎంపీడీఓ లక్ష్మి, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ నాగూనాయక్, పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, హెచ్ఈఓ సముద్రాల సూరి పాల్గొన్నారు.