‘అందరికి శ్రీహరే అంతరాత్మ’ అని సామాజిక సమానత్వాన్ని కోరుకుని తిరుమల వేంకటేశ్వరస్వామిని వేలాది పదకవితలతో అర్చించిన సాహితీవేత్త తాళ్లపాక అన్నమయ్య. పదకవితా పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన అన్నమయ్య పాటల్లో ఆధ్యాత్మికతతోపాటు సామాజికత, మధురభక్తి, జానపదుల బాణీలు, అప్పటి రాయలసీమ మాండలిక పదాలు, గ్రామీణ జీవితం లాంటివి ప్రముఖంగా కనిపిస్తాయి. అన్నమయ్య పద సాహిత్యం మీద ఎంతోమంది విశ్లేషణలు చేశారు.
ఇప్పటికీ చేస్తున్నారు. వీరిలో ప్రముఖులైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, ఆరుద్ర, అప్పజోడు వెంకటసుబ్బయ్య, ఆచార్య వేటూరి ఆనందమూర్తి, ఆచార్య ఎస్.గంగప్ప తదితరులు రాసిన వ్యాసాలను జైభారత్ పబ్లికేషన్స్ ‘అందరికి శ్రీహరే అంతరాత్మ’ పేరుతో సంకలనంగా తీసుకువచ్చింది. ఇందులో అన్నమయ్య సంకీర్తనల్లో వివిధ కోణాలను స్పృశిస్తూ రాసిన వ్యాసాలు ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే పదకవితా పితామహుని పాటల అంతరార్థం అర్థమవుతుంది.
సంపాదకులు: రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
పేజీలు: 338, ధర: రూ. 300
ప్రచురణ: జైభారత్ పబ్లికేషన్స్
ప్రతులకు: ఫోన్: 98480 19076
ఓ వయసులో నాన్న అవసరం లేదనిపిస్తుంది. నాన్న ప్రవర్తన చాదస్తంగా కనిపిస్తుంది. ఆయన మంచి చెబితే వినాలనిపించదు. జాగ్రత్త చెప్పినా చెవికెక్కదు. కానీ, రూపంలో గోరంత, గుణగణాల్లో అణువంత ప్రతిఫలించే నాన్న.. అండదండల్లో కొండంత అని చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది! ఈ సత్యాన్ని నిరూపించిన నవల ‘నా(న్న)కేం తెలుసు?’. కొడుకు జీవితంతో మొదలై.. తండ్రి త్యాగంతో ముగుస్తుందీ కథ. మొదట్లో సాదాసీదాగా కనిపించే తండ్రి పాత్రను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయారు రచయిత.
తల్లిదండ్రులను ఎలా అర్థం చేసుకోవాలో ఈ తరానికి చెబుతుందీ నవల. శాస్త్రీయ విషయాలు, వర్తమాన అంశాలు, మానవీయ విలువలు, అరాచక వాదాలు, ఆశలు, ఆశయాలు అన్నిటినీ గుదిగుచ్చి నవలను ఆసాంతం చదివేలా చేయడంలో రచయిత కిరణ్కుమార్ కృతకృత్యులయ్యారు.
రచయిత: డా. కిరణ్కుమార్ యర్రంశెట్టి
పేజీలు: 120, ధర: రూ.199
ప్రతులకు: 79931 23083
రచన: ఎమ్బీయస్ ప్రసాద్
పేజీలు: 112, ధర: రూ. 60
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్
ఫోన్: 90004 13413