సురవరం ప్రతాపరెడ్డి 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను వెలువరించి తెలంగాణలో సారస్వత వారసత్వాన్ని నిరూపించారు. తెలంగాణ సాహిత్య లోకానికి ఆత్మవిశ్వాసం కలిగించి గొప్ప చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు. ‘తెలంగాణ యశోధరులు’ పుస్తకం ద్వారా సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు డాక్టర్ నమిలకొండ సునీత. తన పరిశోధన వ్యాసంగంలో భాగంగా వివిధ దశల్లో తెలంగాణ కోణంతో వెలువరించిన పరిశోధన పత్రాలు, పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. తన పరిధిలో తాను పుట్టిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వేముగంటి నరసింహాచార్యులు, పీవీ నరసింహారావు, సాంబశివుడు, కాశీనాథుడు, మెట్టినిల్లయిన నిజామాబాదు జిల్లాలోని దోర్బల విశ్వనాథశర్మ, అయాచితం నటేశ్వరశర్మ చేసిన సాహిత్య సేవలు, నిజామాబాదు జిల్లా నవలా చరిత్ర, తెలంగాణ సంస్థానాలలో మహిళా సాహిత్యం, తెలంగాణలో అవధాన ప్రక్రియపై ఎంతో శ్రమకోర్చి సమగ్రంగా, సప్రామాణికంగా రాసిన వ్యాసాలు భావి తెలంగాణ సాహిత్య చరిత్ర పరిశోధకులకు కరదీపికలు. ప్రతి నాగరికుడు మాతృభాషలోనే మాట్లాడుతాడు అన్న కోణంలో రాసిన వ్యాసం రచయిత్రి తెలుగు భాషా గరిమకు నిదర్శనం. విశ్వనాథ సత్యనారాయణ రచించిన వేయిపడగలు, ఏకవీర నవలలపై సునీత చేసిన సమీక్ష ఆమె పాండిత్యానికి మచ్చుతునక. రైతుపై వెలువరించిన వ్యాసం కవికోకిల దువ్వూరి రామిరెడ్డి సారస్వత వారసత్వానికి యోగ్యతా పత్రం లాంటిది.
రచన: డాక్టర్ నమిలకొండ సునీత
వెల: రూ. 150
ప్రచురణ: సునిశిత ప్రచురణలు
ప్రతులకు: ఫోన్: 99084 68171
పేజీలు: 200
వెల: రూ. 150
ప్రచురణ: సుమిర క్రియేషన్స్
ప్రతులకు:
ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94903 70248
రచన: గండ్రకోట
సూర్యనారాయణ శర్మ
పేజీలు: 120
వెల: రూ. 150
ప్రచురణ:
అచ్చంగా తెలుగు ప్రచురణ
ఫోన్: 85588 99478
రచన: ఎం.బి.గౌతమ్
పేజీలు: 126, వెల: రూ. 70
ప్రచురణ: సమాంతర ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 92465 86254