అనుమానం లేదు. కొవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల వల్ల, ఇంట్లోనే ఉండిపోయిన పిల్లలు రకరకాల సవాళ్లను ఎదుర్కొన్నారు. పసివాళ్లను ఊబకాయం, కుంగుబాటు, నిరుత్సాహం లాంటి సమస్యలు పీడించాయి. విద్యార్థుల మీద లాక్డౌన్ ప్రభావాన్ని పరిశోధిస్తున్నప్పుడు, ఓ అనూహ్యమైన ఫలితం కనిపించింది. స్విట్జర్లాండ్కు చెందిన, విద్యార్థుల ఆరోగ్యం మీద ఆన్లైన్ తరగతుల ప్రభావాన్ని గమనించేందుకు మూడువేల మంది నుంచి వివరాలను సేకరించారు. గత పరిశోధన ఫలితాలను, వారి దైనందిన జీవితాలతో పోల్చి చూశారు. బడికి వెళ్లిన రోజులతో పోలిస్తే, ఆన్లైన్లో చదువుకున్న రోజుల్లో వీరికి దాదాపు 75 నిమిషాలపాటు ఎక్కువ నిద్ర దొరుకుతున్నట్టు తేలింది. బడలిక తీరకుండానే నిద్రలేచి పరుగులు తీసే అవస్థ తప్పినట్టు కనిపించింది. కంటినిండా నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. ఇక మీదట పిల్లల నిద్రకు భంగం కలగకుండా, కాస్త ఆలస్యంగా బడివేళలు ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు.