veerabrahmendra swamy temple | తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియని వారు ఉండరు. ఆయన భవిష్యవాణి వినని వారూ ఉండరు. అదే పోతులూరి స్వామి మఠం మన తెలంగాణలోనూ ఉందని చాలామందికి తెలియదు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో శతాబ్దాల కిందట నెలకొల్పిన ఈ మఠం రెండో కందిమల్లయ్యపల్లెగా వెలుగొందుతున్నది.
శతాబ్దాల కిందటే.. రేగోడులో బ్రహ్మంగారి మఠం వెలిసింది. అప్పట్లో ఈ ప్రాంతంలో శరబాక లింగమయ్య అనే వ్యక్తి నాటువైద్యం చేస్తూ ఉండేవాడు. ఆ సమయంలో రేగోడు ప్రాంతంలో కలరా ప్రబలింది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. లింగమయ్య ఎంత ప్రయత్నం చేసినా కలరా తగ్గలేదు. దీంతో కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలోని బ్రహ్మంగారి మఠానికి వెళ్లాడు. అక్కడి మఠాధిపతి ఆదేశానుసారం రేగోడులో మఠం నెలకొల్పాడు. ఆ తర్వాతే, కలరా తీవ్రత తగ్గిందని స్థానికులు చెబుతారు. కొన్నాళ్లకు లింగమయ్య మఠం ప్రాంగణంలోనే సజీవ సమాధి అయ్యాడు. నాటి నుంచి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి అవతరించిన కార్తిక శుక్ల ద్వాదశి నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ వేడుకలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల రైతుల ఎడ్లబండ్ల ప్రదర్శన ఉంటుంది. ఏటా వైశాఖ శుద్ధ పంచమి మొదలు ఆరు రోజులు జాతర చేస్తారు. అన్ని రోజులూ ఆరు బయలు నాటకాలు ప్రదర్శిస్తారు.
✍ సంతోష్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
గాంధారి మైసమ్మ | మేడారం జాతరలాగే రెండేండ్లకొకసారి జరిగే ఆదివాసీల జాతర గురించి తెలుసా
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
గ్రేట్ వాల్ ఆఫ్ తెలంగాణ.. ఇది ఎక్కడుంది.. దాని ప్రత్యేకతలేంటి తెలుసా?