మానవశరీరం మీద నేరుగా ప్రయోగాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టే, ఎలుకల్లాంటి చిన్నచిన్న జీవుల మీద కానీ, ప్రయోగశాలల్లో పెంచిన కణాల మీద కానీ అధ్యయనాలు చేస్తుంటారు. సహజంగానే వీటితో పూర్తిస్థాయి ఫలితాలు రావు. ఇప్పుడు ఆ సమస్యకు విరుగుడు దొరికిందనే భావించాలి. అమెరికా, బ్రిటన్ పరిశోధకులు polyethylene glycol అనే పదార్థాన్ని ఉపయోగించి, మానవ శరీరాన్ని పోలిన కణజాలాన్ని రూపొందించగలిగారు. ఈ సాంకేతికతతో క్లోమగ్రంథి క్యాన్సర్ను నయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. క్లోమగ్రంథికి సోకే క్యాన్సర్ను ప్రాణాంతకంగా భావిస్తారు. కానీ, తాజా ఆవిష్కరణతో… అవసరమైనవారికి కృత్రిమమైన క్లోమాన్ని అందించేందుకు, క్యాన్సర్ మందుల ప్రభావాన్ని గమనించేందుకు వీలవుతుంది. అంతేకాదు! ఈ ప్రయోగం విజయవంతం అయితే ఊపిరితిత్తులు, పేగు తదితర అవయవాలకు సోకే క్యాన్సర్ల నుంచి కూడా ఊరట లభించవచ్చు. అదే సాధ్యమైతే వైద్య రంగంలో సరికొత్త విప్లవం మొదలైనట్టే. క్యాన్సర్పై మనదే పైచేయి.