మనుషులు ఒకరితో ఒకరు, ఆ ఒక్కరు మరొకరితో పరిచయమవుతూ, ఒకరికొకరు సాయం చేసుకోవడం ‘రిలేషనల్ నెట్వర్క్’. ఈ సంబంధాన్ని ఒక చిత్రంలో చూపిస్తే అది శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టులా ఉంటుంది. ఇలా సాయం చేసుకునే తత్వం తరాలపాటు అలాగే కొనసాగితే భూమ్మీద ఎప్పటికీ మంచే నిలిచి ఉంటుంది. ఈ సూత్రం నేపథ్యంగా ఉమా మహేష్ ఆచాళ్ళ ‘సంఘే శక్తి కలియుగే’ పేరుతో కథ రాశారు. సంపుటిలోని 21 కథల్లో 15వ కథ పేరును పుస్తక శీర్షికగా ఎంచుకున్నారు. ఇందులో మొదటి కథ ‘తిరగబడ్డ చేప’ వ్యవసాయాన్ని నమ్ముకుని తండ్రి, చేపల చెరువును నమ్ముకుని కొడుకు దగాపడ్డ వైనాన్ని చిత్రీకరిస్తుంది. సంతానం లేని అక్క తమ్ముడిని దత్తత తీసుకుని, అమ్మ తర్వాత అమ్మంతటిది అక్కే అని చాటుతుంది ‘అక్క బంగారం’. చాడీల కారణంగా ప్రాణమిత్రుల మధ్య పొరపొచ్చాలు ఎలా వస్తాయో, వాటి పర్యవసానం ఎలా ఉంటుందో ‘అడ్డుగోడ’ వెల్లడిస్తుంది. కలిసుండటం తెలియక విడిపోయేవాళ్లు విడిపోవటం తెలియక కలిసుండేవాళ్ల మనస్తత్వాన్ని ‘ఒక రాత్రి’ విడమరుస్తుంది. పనిమనుషులతో యజమానురాళ్ల ప్రవర్తనలో వైరుధ్యాలను కండ్లకు కట్టే కథలు ‘బొంకవచ్చు నఘము పొందధిప’, ‘ఆదివారం అనుబంధం’. ఇలా ఈ సంకలనంలోని ప్రతి కథా మంచి కథనంతో విసుగు లేకుండా చదివిస్తుంది. ఉమా మహేష్ ‘సంఘే శక్తి కలియుగే’లోని కథలన్నీ విశాఖపట్నం నగరం, దాని పరిసర ప్రాంతాల నేపథ్యంతో సాగినా తెలుగు ఇండ్ల చుట్టూ ఉండే మధ్యతరగతి, పేదల జీవితాల చిత్రణతో సాగిపోతాయి. అంతర్లీనంగా మంచిని పెంచాలనే సందేశాన్ని ఇస్తాయి.
రచన: ఉమా మహేష్ ఆచాళ్ళ
పేజీలు: 166, వెల: 120
ప్రతులకు: ఫోన్: 98493 03247
-చింతలపల్లి హర్షవర్ధన్
మూలం: చెరుకు మాధవ రెడ్డి (మాజీ ఎంపీ)
అనువాదం: మెహక్ హైదరాబాదీ
పేజీలు: 58, వెల: రూ. 125
ప్రచురణ: జాతీయ సాహిత్య పరిషత్
ప్రతులకు: 70361 75175
రచన: టి. శ్రీవల్లీ రాధిక
పేజీలు: 50
వెల: రూ. 150
ప్రచురణ: ప్రమథ ప్రచురణలు
ఫోన్: 94416 44644
రచన: దర్భముళ్ళ చంద్రశేఖర్
పేజీలు: 192
వెల: రూ. 200
ప్రచురణ: ఉదయ్
పబ్లిషింగ్ హౌస్
ఫోన్: 94918 50718