తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం ఏటా తెలంగాణ కథలతో సంకలనాలను అచ్చు వేస్తున్నది. ఈ ప్రాంతపు కథకులను ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రయత్నంలో వచ్చిన తొమ్మిదో సంకలనమే ‘నెనరు’. ఇందులో 2021లో వివిధ పత్రికల్లో అచ్చయిన పదమూడు తెలంగాణ కథలను పొందుపరచారు. తమ్మెర రాధిక రాసిన ‘కొత్త దొరలు’ తెలంగాణ పల్లెల్లో మారుతున్న భూ సంబంధాలను, రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరణను కండ్లకు కడుతుంది. ఓ ఊరి సంత నేపథ్యంలో సాగే వర్గపోరాటాన్ని వెల్దండి శ్రీధర్ ‘అంగడి’ కథలో అక్షరీకరించాడు. ‘బతికున్నప్పుడు మనిషిని మంచిగా చూసుకోవాలి గానీ, చనిపోయినంక దానాలు చేసుడు అవసరమా?’ అనే ప్రశ్న చిగురింపజేస్తుంది కాలువ మల్లయ్య కథ ‘కుక్క సద్ది’. అఫ్సర్ రాసిన ‘ఐ’ కథ తరాల సంధి దశలో సిద్ధాంతాల వైరుధ్యాన్ని తెలియజేస్తుంది. తెలంగాణ నగరాల నుంచి పల్లెలకూ పాకుతున్న మాదకద్రవ్యాల దుష్ప్రభావాన్ని చిత్తలూరి సత్యనారాయణ రచించిన ‘గోధుమరంగు పాము’ చిత్రిస్తుంది. సాంకేతికత ప్రధానంగా సాగే ఆధునిక వృత్తుల్లో గందరగోళాన్ని మన్ ప్రీతం కథ ‘కే.టీ.’ వ్యక్తం చేస్తుంది. పల్లెల్లో రాజకీయాలకు మతాన్ని అడ్డంపెట్టుకుని మనుషుల మనుసుల్ని విరిచేసే నేపథ్యంతో సాగుతుంది పెద్దింటి అశోక్ కుమార్ కథ ‘దూరం’. ఈ కథలు చదివితే తెలంగాణలో వస్తున్న సామాజిక, ఆర్థిక సంబంధాల ప్రభావాలు అవగాహనలోకి వస్తాయి.
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్
పేజీలు: 140, ధర: రూ. 100
ప్రచురణ: సింగిడి తెలంగాణ రచయితల సంఘం
ప్రతులకు: ఫోన్: 98492 20321
రచన: డా. కాలువ మల్లయ్య
పేజీలు: 180,
ధర: రూ. 150
ప్రచురణ: సామాజిక్ భారత్ ప్రచురణలు
ప్రతులకు: 91829 18567
రచన: డా. సిద్దెంకి యాదగిరి
పేజీలు: 152,
ధర: రూ. 150
ప్రచురణ: మంజీరా
రచయితల సంఘం
ప్రతులకు: ఫోన్: 81211 44773
రచన: జగన్మిత్ర
పేజీలు: 391,
ధర: రూ. 333
ప్రతులకు: ఫోన్: 99485 79989
-చింతలపల్లి హర్షవర్ధన్