పిల్లలు చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. ఆ ప్రోత్సాహంతోనే శాస్త్రీయ, పాశ్చాత్య సంగీత సాధన చేసేవారి సంఖ్య పెరిగిపోతున్నది. కానీ సంగీత సాధనకు అత్యంత ముఖ్యమైనవి వాద్య పరికరాలు. సంప్రదాయ వాద్యాలపై పట్టుసాధించడం మామూలు విషయం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్నవారి కోసం వచ్చేసింది.. జాయ్ప్లే(Joue play). నాలుగు కీబోర్డులు ఉన్న ఈ పరికరంలో రకరకాల మీటలు ఉంటాయి. ఒక్కో కీ ఒక్కో వాద్య ధ్వనిని అందిస్తుంది. ప్రయాణాలు, విహారాల్లో సరికొత్తగా సరిగమలు పలికించ వచ్చన్నమాట. దీని ఆన్లైన్ ధర రూ. 20,250. పూర్తి వివరాలకు jouemusic.com చూడవచ్చు.