విద్యా ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడం కోసం కేంద్రప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ) విద్యార్థుల చదువు కోసం రూపొందించిన గత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేస్తున్నది.
-దీనికి 2014 సంవత్సరంలో కేంద్ర ఆర్థిక వ్యయ కమిటీ ఆమోదం లభించింది.
-కేంద్ర ప్రాయోజిత పథకాలు ప్రస్తుతం మూడు వేర్వే రు విభాగాల్లో 8 రకాలుగా కొనసాగుతున్నాయి.
-ఎస్టీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ట్రైబల్ సబ్ ప్లాన్ ఏరియాల్లో ఆశ్రమ పాఠశాలలు, బాలబాలికల కోసం వసతిగృహాలు, గిరిజన ప్రాంతాల్లో ఒకేషనల్ ట్రైనింగ్, అత్యున్నత స్థాయి విద్య, విదేశీ విద్యా రుణాలు, జాతీయస్థాయి ఫెలోషిప్ వంటి సౌకర్యాలు కల్పించే పథకాలను అమలు చేస్తున్నారు.
-రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో నిర్దిష్టమైన అవసరాలు తీర్చడానికి దీన్ని రూపొందించారు.
-కిందిస్థాయి నుంచి ప్రాధాన్యతలు కల్పించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరమైన మేరకు నిధుల కేటాయింపు కోసం ఎంపిక చేస్తారు.
-నిబంధనల మేరకు రాష్ట్ర, కేందపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిధులను ఖర్చు చేయాలి. కేటాయించిన నిధులను ఇతర అవసరాల కోసం వినియోగించొద్దు.