వెలమరాజుల పాలనా విధానంలో కాకతీయులను అనుసరించారు. వైదిక ధర్మరక్షణ, ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యాలుగా పాలించారు. వైదిక ధర్మాన్ని రక్షించడం కోసం, వర్ణ వ్యవస్థ కాపాడటం కోసం హేమాద్రి రచించిన వ్రతఖండ కల్పతరువు అనే గ్రంథంలో వివరించిన పద్ధతుల ప్రకారం రాజ్య పరిపాలనను నడిపారు. పరిపాలనా వ్యవహారాల్లో రాజులకు ప్రధానమంత్రులు, పురోహితులు, సేనాధిపతులు సలహాలనిచ్చేవారు. వెలమరాజులు తమ మంత్రివర్గంలో బ్రాహ్మణులను కూడా నియమించుకున్నారు. పెద్దన, పోతన, బాచన, సింగన, అయ్యలార్యుడు మొదలైన మంత్రుల పేర్లు నాటి శాసనాలు, సాహిత్యం ద్వారా తెలుస్తుంది. మంత్రులు, పురోహితులు, దేవారికులు కూడా తమ ప్రభువులతో పాటు యుద్ధాలకు వెళ్లేవారు. పరిపాలనలో యువరాజుకు ప్రత్యేక స్థానం ఉండేది. రాజులకు సంతానం లేకపోతే అతని కుమారులు చిన్నవారు అయినప్పుడు సోదరులు, సమీప బంధువులు రాజ్యభారం నిర్వహించేవారు.
పరిపాలనా వికేంద్రీకరణ
దుర్గాలు
గ్రామ పరిపాలన
న్యాయపాలన
పన్నులు
ఆర్థిక పరిస్థితులు
వ్యవసాయం
నీటిపారుదల సౌకర్యాలు
పరిశ్రమలు
వర్తక-వ్యాపారం
సామాజిక పరిస్థితులు
వర్ణవ్యవస్థ
వినోదాలు