1. ఆపరేషన్ పోలోకు అయిన ఖర్చును భారత ప్రభుత్వం ఏ శాఖలో చూపించింది?
1) వైద్యశాఖ 2) విద్యాశాఖ
3) రక్షణ శాఖ 4) హోం శాఖ
2. పోలీస్ చర్య ఎవరి నేతృత్వంలో జరిగింది?
1) జనరల్ మహరాజ్ సింగ్
2) జనరల్ జేఎన్ చౌధురి
3) జనరల్ రుద్ర
4) జనరల్ ఎల్ ఎడ్రూస్
3. కింది వాటిలో సరైనవి?
1) పోలీస్ చర్యలో భాగంగా షోలాపూర్ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి జనరల్ జేఎన్ చౌధురి నాయకత్వం వహించాడు
2) పోలీస్ చర్యలో భాగంగా విజయవాడ నుంచి దాడులు చేస్తున్న సైన్యానికి మేజర్ జనరల్ రుద్ర నాయకత్వం వహించాడు
3) 1 4) 1, 2
4. భారత ప్రభుత్వంపై ఐక్యరాజ్యసమితికి చేసిన ఫిర్యాదును నిజాం ఎప్పుడు వెనకకు తీసుకున్నాడు?
1) 1949, సెప్టెంబర్ 22
2) 1948, అక్టోబర్ 22
3) 1948, సెప్టెంబర్ 22
4) 1949, అక్టోబర్ 22
5. ‘భారతదేశ కడుపులో ఏర్పడ్డ హైదరాబాద్ రాజ్యమనే పుండు’ తొలగిపోయిందని వ్యాఖ్యానించింది?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) జవహర్లాల్ నెహ్రూ
3) రాజగోపాలచారి
4) కేఎం మున్షీ
6. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ప్రముఖ్గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రమాణస్వీకారం చేసింది?
1) 1950, జనవరి 25
2) 1950, జనవరి 26
3) 1950, ఫిబ్రవరి 25
4) 1956, జనవరి 25
7. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జీవించి ఉన్నంతకాలం ఎన్ని రూపాయలు రాజాభరణం చెల్లించడానికి భారత ప్రభుత్వం ఒప్పుకొంది?
1) రూ.కోటి 2) రూ.50 లక్షలు
3) రూ.25 లక్షలు 4) ఏదీకాదు
8. హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్య జరిగింది ఎప్పుడు?
1) 1948, సెప్టెంబర్ 13-17
2) 1948, సెప్టెంబర్ 13-18
3) 1947, సెప్టెంబర్ 13-17
4) 1947, సెప్టెంబర్ 12-17
9. ఆపరేషన్ పోలో జరుగుతున్న సమయంలో భారత సైనిక శాఖ మంత్రి?
1) వల్లభాయ్ పటేల్ 2) బల్దేవ్ సింగ్
3) రాజగోపాల చారి
4) మహరాజ్ సింగ్
10. నిజాం పాకిస్థాన్కు ఎన్ని కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చాడు?
1) రూ.25 కోట్లు 2) రూ.15 కోట్లు
3) రూ.20 కోట్లు 4) రూ.50 కోట్లు