అంతర్జాతీయ న్యాయస్థానాన్ని 1945లో ఏర్పాటు చేశారు. దీన్ని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్నది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు (పదవీకాలం మూడేండ్లు), 15 మంది న్యాయమూర్తులు (పదవీకాలం 9 ఏండ్లు) ఉంటారు. న్యాయమూర్తులు సాధారణ సభ, భద్రతామండలి చేత ఎన్నికవుతారు. ప్రతి మూడేండ్లుకు 1/3 వంతు మంది పదవీ విరమణ చేస్తారు.
అధికార భాషలు ఇంగ్లిషు, ఫ్రెంచ్. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయ న్యాయమూర్తులు సర్ బెనగల్ నర్సింగరావు (1952-53) నాగేంద్రసింగ్ (1973-88), రఘునందన్ స్వరూప్ పాథక్ (1989-1991), దల్వీర్ భండారి (2012-18). దల్వీర్ భండారి తిరిగి ఎన్నికయ్యారు. ఆయన 2018 నుంచి 2027 వరకు న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఉపాధ్యక్షుడిగా నాగేంద్రసింగ్ 1976 -1979, అధ్యక్షుడిగా 1985-88 వరకు పనిచేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ప్రస్తుత అధ్యక్షుడు రోని అబ్రహం (ఫ్రాన్స్), ఉపాధ్యక్షుడు అబ్దులఖ్వీ యూసుఫ్.
దొండో కేశవ్ కార్వే (1858- 1961)