హరారె: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ పరాభవానికి గురైంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లో జింజాబ్వే 19 పరుగుల తేడాతో గెలిచి.. మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలుత బింజాబ్వే 9 వికెట్లకు 118 పరుగులు చేయగా.. పేసర్ లూక్ జాంగ్వే (4/18) ధాటికి ఛేదనలో పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. బాబర్ (41) టాప్స్కోరర్. పొట్టి ఫార్మాట్లో పాక్పై జింబాబ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం.