పొట్టి ప్రపంచకప్లో హేమాహేమీలు పోటీపడే సూపర్-12 రేసులో జింబాబ్వే కూడా చేరింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్ రెండో దశకు చేరుకోని జింబాబ్వే.. శుక్రవారం జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్పై విజయం సాధించి చరిత్ర సృష్టించింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లో క్రమశిక్షణ చూపిన ఆ జట్టు విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స్కాట్లాండ్ను కట్టుదిట్టమైన బౌలింగ్తో 132/6 స్కోరుకే పరిమితం చేసింది. అనంతరం బ్యాటింగ్లో కెప్టెన్ క్రెగ్ ఇవాన్స్ (58), సికందర్ రజా (40) రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. చివర్లో మిల్టన్ షూంబా (11 నాటౌట్), ర్యాన్ బర్ల్ (9 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఆ జట్టు 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు సాధించింది. ఈ విజయంతో గ్రూప్-బి టాపర్గా నిలిచి, మొట్టమొదటిసారి టీ20 ప్రపంచకప్ రెండో దశలో అడుగుపెట్టింది.