PCB New Chariman : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) చైర్మన్ నజం సేథీ(Najam Sethi) పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో, అతడి స్థానంలో కొత్త చైర్మన్ రాబోతున్నాడు. జకా అష్రఫ్(Zaka Ashraf) మళ్లీ పీసీబీ బాస్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అవును.. ప్రధానిషెహబాజ్ షరీష్(Shehbaz Sharif) మంగళవారం అతడి పేరును సిఫారసు చేశాడు. దాంతో, అష్రఫ్ ఎంపిక దాదాపు ఖరారైంది.
అష్రఫ్ 2011 నుంచి 2014 ఫిబ్రవరి వరకు పీసీబీ అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రధాని నవాజ్ షరీఫ్ పీసీబీని రద్దు చేయడంతో అతను పదవి కోల్పోయాడు. పీసీబీ నియమాల ప్రకారం.. కొత్తగా ఎంపికైనవాళ్లు బోర్డులోని 10 మంది సభ్యులలో భాగం అవుతారు. ఆ తర్వాత బోర్డు సభ్యులు వాళ్లలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. వ్యాపారవేత్త అయిన అష్రఫ్కు అధికార పార్టీ రాజకీయ పెద్దల మద్దుతు ఉంది. దాంతో, అతడు పీసీబీ చీఫ్ అవడం దాదాపు ఖరారైనట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి.
పాక్లో క్రికెట్ బోర్డు అధ్యక్షుడిని ప్రధానే పరోక్షంగా ఖరారు చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఆరు నెలల కాలంలో పీసీబీకి అష్రఫ్ మూడో అధ్యక్షుడిగా సేవలందించనున్నాడు. అవును.. ఈ ఏడాది ప్రారంభంలో చీఫ్గా ఉన్న రమీజ్ రాజా(Ramiz Raja)ను తొలగించడంతో నజం సేథీ బాధ్యతలు చేపట్టాడు. సేథీ తప్పుకోవడంతో ఇప్పుడు అష్రఫ్ పగ్గాలు అందుకోనున్నాడు.
రమీజ్ రాజా, నజం సేథీ
ఆసియాకప్(Aisa Cup 2023) వేదిక, భారత్లో వన్డే వరల్డ్ కప్(ODI WC 2023) ఆడడంపై వివాదస్పద వ్యాఖ్యలతో నజం సేథీ తరచూ వార్తల్లో నిలిచాడు. అతడి తీరుపై మాజీ క్రికెటర్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. చీఫ్ సెలెక్టర్ షాహీద్ ఆఫ్రీదీ(Shaheed Afirdi) సైతం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదిక అహ్మదాబాద్ లేదా మరేదైనా అయితే అతడికి ఏం అవసరం? అని చురకలు అంటించాడు. పాక్ గడ్డపై టీమిండియా ఆడేది లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా (Jai Shah) తేల్చి చెప్పడంతో నజం సేథీ హైబ్రిడ్ మోడల్ కోసం పట్టుపట్టాడు. ఎట్టకేలకు పాక్ నాలుగు మ్యాచ్లు ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఒప్పుకుంది. అయితే.. భారత్, పాక్ మ్యాచ్ మాత్రం శ్రీలంకలో జరగనుంది.