కొలంబో: భారత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, కృష్ణప్ప గౌతమ్ సైతం కరోనా బారినపడ్డారు. ఇటీవలే ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాకు పాజిటివ్ రావడంతో అతడితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మంది ఆటగాళ్లను కొలంబోలోని ఒక హోటల్లో ఐసోలేషన్లో ఉంచగా.. వారిలో చాహల్, గౌతమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని బీసీసీఐ తెలిపింది. దీంతో కృనాల్తో పాటు చాహల్, గౌతమ్ కూడా ఐసోలేషన్ ముగిసేదాకా లంకలోనే ఉండనున్నారు.