పెర్త్: పొట్టి ప్రపంచకప్ ఫ్రారంభానికి ముందు యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్ల్లో రాణించిన సూర్య.. టీ20 వరల్డ్కప్ ప్రాక్టీస్ మ్యాచ్లోనూ అర్ధశతకంతో సత్తాచాటాడు. సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ పోరులో టీమ్ఇండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది.
సూర్యకుమార్ (35 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకం నమోదు చేసుకోగా.. హార్దిక్ పాండ్యా (27), దీపక్ హుడా (22) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్శ్దీప్ సింగ్ 3 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ చెరో 2 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. మెగాటోర్నీకి ముందు అందరికీ ప్రాక్టీస్ చేసే అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్కు దిగలేదు.