న్యూఢిల్లీ: యువ వికెట్కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. సరిగ్గా 14 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు బీసీసీఐ మంగళవారం పేర్కొంది.
దీంతో త్వరలో మొదలయ్యే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు పంత్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశముంది. గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో పేసర్లు మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఐపీఎల్కు దూరమైనట్లు బోర్డు పేర్కొంది.