హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప సంపద యోగా అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) పురస్కరించుకుని ‘న్యూ మాంక్ యోగా అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో మొయినాబాద్లోని కేఎల్ యూనివర్సిటీలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడలకు సముచిత ప్రాధాన్యమిస్తున్నారు. క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా విద్యను ప్రోత్సహిస్తున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నరేశ్, రవికుమార్, రాజా శిఖామణి, శ్యామ్సుందర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.