హామిల్టన్: వుమెన్స్ వరల్డ్కప్లో ఇవాళ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. యస్తికా భాటియా హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఇండియన్ బ్యాటర్లలో షఫాలీ వర్మ, రీచా ఘోష్లు కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన మంచి స్టార్ట్ ఇచ్చింది. షఫాలీ, స్మృతిలు ఆరంభంలో స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరుసగా మూడు వికెట్లను తీసింది. స్మృతి, షఫాలీ, మిథాలీలు వరుసగా ఓటయ్యారు. ఆ తర్వాత హర్మన్ప్రీత్, రీచా ఘోష్లు కూడా ఓటయ్యారు. కానీ భాటియా నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేసింది. స్మృతి 30, షఫాలీ 42, భాటియా 50 రన్స్ చేశారు. ఈ మ్యాచ్లో ఇండియా ఒక మార్పు చేసింది. మేఘనా సింగ్ స్థానంలో పూనమ్ యాదవ్ వచ్చింది. బంగ్లా, సౌతాఫ్రికాపై గెలిస్తే, అప్పుడు మిథాలీ సేన సెమీస్కు అర్హత సాధిస్తుంది.