Yashasvi Jaiswal : ఇంగ్లండ్ సిరీస్లో దంచికొడుతున్న భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. వరుసగా రెండో డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన యశస్వీ.. రాంచీ టెస్టు(Ranchi Test)లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా 73 పరుగులతో రాణించి ఈ సిరీస్లో 600 పరుగుల మార్క్ దాటాడు. తద్వారా ఒకే సిరీస్లో అత్యధిక పరుగులతో క్రికెట్ దిగ్గజాలు గ్యారీ సోబర్స్, డాన్ బ్రాడ్మన్ సరసన నిలిచాడు.
ఒకే టెస్టు సిరీస్లో ఆరొందలకు పైగా రన్స్ కొట్టిన సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), గ్రేమ్ స్మిత్, జార్జ్ హెడ్లే, నీల్ హర్వేతో కూడిన ఎలైట్ క్లబ్(Elite Club)లో చోటు దక్కించుకున్నాడు. క్రికెట్ లెజెండ్ బ్రాడ్మన్ 1930లో ఇంగ్లండ్పై ఓ రేంజ్లో చెలరేగాడు. వీరబాదుడు బాదిన అతడు ఏకంగా 974 రన్స్ కొట్టాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గ్యారీ సోబర్స్ రెండో స్థానంలో నిలిచాడు. 1957-58 మధ్య పాకిస్థాన్పై 824 పరుగులు బాదాడు. భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ 1970-71లో వెస్టిండీస్పై 774 రన్స్ కొట్టి థర్డ్ ప్లేస్ సంపాదించాడు.
సునీల్ గవాస్కర్, గ్రేమ్ స్మిత్