లక్నో: ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 20న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి ఒక ఆవు వచ్చింది. (Cow Enters Hospital) అది నేరుగా రోగులు ఉన్న ఒక వార్డులోకి వెళ్లింది. దీంతో ఆ వార్డులోని బెడ్లపై ఉన్న రోగులు, ఆ పక్కగా ఉన్న వారి బంధువులు ఆ ఆవును చూసి భయాందోళన చెందారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో కొంతసేపు ఉన్న ఆ ఆవు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. అది ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడ్డారు. అలాగే ఉత్తరప్రదేశ్ అంతటా వీధుల్లో పశువుల సంచారం వల్ల స్థానికులు భయాందోళన చెందడంతోపాటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని మరికొందరు విమర్శించారు.
यूपी के रायबरेली में नंदी जी (सांड) जिला अस्पताल इलाज लेने पहुंचे।
डॉक्टर के ना मिलने पर निराश होकर वापस आना पड़ा… #Raibareli pic.twitter.com/MwTpkDc1OP
— Ritesh (@riteshsainilive) February 20, 2024