అమరావతి : పవన్ సీఎం అవుతారని కాపులు, జనసేన సైనికులంతా భ్రమించారని, కాని వారి ఆశలను పవన్ అడియాశలు చేశారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati) ఆరోపించారు. కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమై కాపుల పరువు తీశారని దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి పవన్ పరువు నిలుపుకోవాలని హితబోధ చేశారు. ప్యాకేజీ( Package) రాజకీయాలకు పవన్ బలికావొద్దని సూచించారు.
కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమై కాపుల పరువు తీశారని దుయ్యబట్టారు. చంద్రబాబు, అతడి కొడుకు నారా లోకేశ్(Lokesh), బావమరిది బాలకృష్ణ(Balakrishna) పోటీ చేస్తున్న నియోజకవర్గాలను ప్రకటించారని, పవన్ ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేదని అతడికి నిర్దిష్ట విధానం లేదని విమర్శించారు. చంద్రబాబును మోయడమే పవన్కు తెలుసని ఆరోపించారు. టీడీపీ, జనసేనల మధ్య కొనసాగుతున్న పొత్తుతో వారివారి పార్టీలో గందరగోళంగానే ఉన్నాయని విమర్శించారు.