Yashasvi Jaiswal : అంతర్జాతీయ క్రికెట్లో భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. గత ఏడాది ఫామ్ కొనసాగిస్తున్న ఈ చిచ్చరపిడుగు పదో ఇన్నింగ్స్లోనే డబుల్ సెంచరీ(Double Century)తో దిగ్గజాల సరసన నిలిచాడు. యశస్వీ కంటే ముందు నలుగురు భారత క్రికెటర్లు మాత్రమే 10 ఇన్నింగ్స్ల లోపు ద్విశతకం బాదారు.
కరుణ్ నాయర్ 3 ఇన్నింగ్స్ల్లోనే డబుల్ సెంచరీ కొట్టగా.. వినోద్ కాంబ్లీ నాలుగు, సునీల్ గవాస్కర్, మయాంక్ అగర్వాల్లు 8వ ఇన్నింగ్స్లో రెండొందలు కొట్టారు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పూజారా 9వ ఇన్నింగ్స్లో డబుల్ కలను నిజం చేసుకున్నాడు. దాంతో, యశస్వీ 10 ఇన్నింగ్స్లకే డబుల్ సెంచరీ కొట్టి.. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వల్ల కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
That Leap. That Celebration. That Special Feeling 👏 👏
Here’s how Yashasvi Jaiswal notched up his Double Hundred 🎥 🔽
Follow the match ▶️ https://t.co/X85JZGt0EV#TeamIndia | #INDvENG | @ybj_19 | @IDFCFIRSTBank pic.twitter.com/CUiikvbQqa
— BCCI (@BCCI) February 3, 2024
క్రీజులోకి రావడమే ఆలస్యం.. బౌలర్లపై విరుచుకుపడే యశస్వీ 22 ఏండ్లకే టెస్టుల్లో డబుల్ సెంచరీ బాదాడు. దాంతో, చిన్నవయసులోనే డబుల్ సెంచరీ బాదిన మూడో భారత క్రికెటర్గా యశస్వీ రికార్డు సృష్టించాడు. వినోద్ కాంబ్లీ 21 ఏండ్ల 35 రోజుల వయసులో ద్విశతకం కొట్టాడు. ఆ తర్వాత సునీల్ గవాస్కర్ 1971లో వెస్టిండీస్పై డబుల్ సెంచరీ కొట్టాడు. అప్పటికీ అతడి వయసు 21 ఏండ్ల 283 రోజులు.
సౌరభ్ గంగూలీ, యశస్వీ
అంతేకాదు సుదీర్ఘ ఫార్మాట్లో డబుల్ సెంచరీ కొట్టిన భారత నాలుగో లెఫ్ట్ హ్యాండర్గా యశస్వీ మరో రికార్డు నెలకొల్పాడు. సౌరభ్ గంగూలీ 2007లో ఇంగ్లండ్పై 239 రన్స్ కొట్టాడు. 1993లో వినోద్ కాంబ్లీ జింబాబ్వేపై 227 పరుగులతో చెలరేగాడు. గౌతం గంభీర్ 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీ(206 ) బాదాడు.
పేదింటి కుటుంబంలో పుట్టిన యశస్వీ క్రికెటర్ అయ్యేందుకు నానా కష్టాలు పడ్డాడు. తండ్రి భూపేంద్ర జైస్వాల్తో కలిసి పానీపూరీ కూడా అమ్మాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా క్రికెట్ను వదిలేయని యశస్వీ.. రంజీల్లో దంచి కొట్టాడు. ఆ తర్వాత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు ఆడడం అతడి కెరీర్నే మార్చేసింది.
తండ్రితో కలిసి పానీపూరీ అమ్ముతూ..
ఐపీఎల్ 16వ సీజన్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో పాటు మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన యశస్వీ.. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్లోనూ తన ముద్ర వేశాడు. తొలి టెస్టులోనూ సెంచరీ బాది సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత ఆసియా గేమ్స్, ఆస్ట్రేలియా సిరీస్లోనూ యశస్వీ.. విధ్వంసక ఇన్నింగ్స్లతో ఓపెనర్గా తనకు తిరుగులేదని చాటుకున్నాడు.
ఇప్పుడు ఇంగ్లండ్తో జరుగుతున్న వైజాగ్ టెస్టులో టాపార్డర్ కుప్పకూలిన చోట.. ఓపికగా నిలబడి ఏకంగా డబుల్ సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. ఈ ఇన్నింగ్స్తో టీ20ల్లోనే కాదు టెస్టుల్లోనూ తాను టీమిండియా భవిష్యత్ సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు.