ముంబై: ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు లార్డ్స్ మైదానం ఆతిథ్యమివ్వడం లేదు. ఈ మ్యాచ్ సౌథాంప్టన్లో జరగనున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించారు. నిజానికి దీనిపై ఐసీసీ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా గంగూలీ మాత్రం సౌథాంప్టనే అని తేల్చేశారు. లండన్లో పెరిగిపోతున్న కరోనా కేసుల కారణంగానే వేదికను లార్డ్స్ నుంచి సౌథాంప్టన్కు తరలించారు. ఇండియా, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్లో జరగబోయే ఫైనల్ మ్యాచ్కు వెళ్లాలని అనుకుంటున్నా అని ఇండియా టుడేతో గంగూలీ చెప్పాడు. ఈ ఫైనల్ వన్డే వరల్డ్కప్కు ఉన్నంత విలువ ఉంటుందా అని ప్రశ్నించగా.. ప్రతి ట్రోఫీకి దానికి ఉండాల్సిన విలువ ఉంటుంది. వన్డే వరల్డ్కప్ అద్భుతమైనది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి డబ్ల్యూటీసీ క్లిష్టంగా మారింది. ప్రతి టీమ్ సమానమైన మ్యాచ్లు ఆడినప్పుడు చూడండి అని గంగూలీ అన్నారు. ఐపీఎల్ నుంచి ఆరు నెలల పాటు బయో బబుల్లో ఉన్నా ప్లేయర్స్ సాధించిన ఘనత అద్భుతమని గంగూలీ కొనియాడారు. ఫైనల్లో న్యూజిలాండ్పైనా గెలుస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.