WTC Final : వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తన ముందుంచిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తడబడుతోంది. నాలుగురోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు భారత్.. ఐదోరోజు మరో 15 పరుగులు కూడా చేయకముందే రెండు కీలక వికెట్లను కోల్పోయింది.
భారత ఇన్నింగ్స్ 47వ ఓవర్ మూడో బంతికి స్కాట్ బొలాండ్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ (49) స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఒక్క బంతి గ్యాప్తో 47వ ఓవర్ ఐదో బంతికి రవీంద్ర జడేజా (0) అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరుకున్నాడు. 49 ఓవర్ల ఆట ముగిసే సమయానికి అజింక్య రహానే 31, శ్రీకర్ భరత్ 5 పరగులతో క్రీజులో ఉన్నారు.
జట్టు మొత్తం స్కోరు 5 వికెట్ల నష్టానికి 186 పరుగులుగా ఉన్నది. భారత్ విజయం సాధించాలంటే ఈ రోజు ముగిసే సమయానికి మరో 259 పరుగులు చేయాల్సి ఉంది. ఆ లోపు మరో ఐదు వికెట్లు తీస్తే ఆస్ట్రేలియా ఛాంపియన్గా నిలువనుంది.