లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత జట్టు వెనుకంజలో ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేయగా.. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 69.4 ఓవర్లలో కేవలం 296 పరుగులు చేసి మూడోరోజు లంచ్ బ్రేక్ తర్వాత కాపేపటికే ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టుకు 173 పరుగుల భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టింది.
భారత బ్యాటర్లలో అజింక్య రహానే, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ మాత్రమే రాణించారు. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ఇలా క్రీజులోకి వచ్చి అలా పెవిలియన్కు వెళ్లారు. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో.. రహానే, జడేజా ఇద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు.