WT20 World cup | ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. విండీస్ నిర్దేశించిన 119 పరుగుల టార్గెట్ను 4 వికెట్ల నష్టానికి సునాయసంగా చేధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కెప్టెన్ మాథ్యూస్ రెండు పరుగులకే ఔటయ్యి పెవిలియన్ చేరింది. స్టాఫానీ టేలర్ (42), షెమైన్ (30) రాణించారు. వీరిద్దరూ కలిసి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ అందించారు. అయితే వీళ్లిద్దరూ ఔటయిన తర్వాత వచ్చిన హెన్రీ (2), షబికా (15), ఫ్లెచర్ (0) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి విండీస్ 118 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు, రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.
విండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళా క్రికెటర్లు రెచ్చిపోయారు. నాలుగో ఓవర్లోనే స్మృతి మంధన్నా (10) నిరాశప్పటికీ.. షఫాలీ వర్మ (28) నిలకడగా ఆడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిచాఘోష్ (44*), హర్మన్ ప్రీత్ కౌర్ (33) రాణించారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 18.1 ఓవర్లోనే విండీస్ నిర్దేశించిన టార్గెట్ను చేధించింది.