చండీగఢ్: అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికలు వాయిదా పడ్డాయి. హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటీషన్ను శుక్రవారం విచారణకు స్వీకరించిన పంజాబ్-హర్యానా హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎన్నికలు నిలిపివేయాలంటూ తీర్పు వెలువరించింది.
హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్(హెచ్డబ్ల్యూఏ), హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కోర్టు ఎక్కడం డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల వాయిదాకు దారితీసింది. డబ్ల్యూఎఫ్ఐలో తమకు ఓటింగ్ హక్కు ఉందంటూ ఇరు పక్షాలు వాదన దిగడం వివాదానికి కారణమైంది.