మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తుచేసింది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన స్మృతి మంధన సారథ్యంలోని బెంగళూరు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.
హేమలత (31) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ బెత్ మూనీ (8), లిచ్ఫీల్డ్ (5), వేద కృష్ణమూర్తి (9), ఆష్లే గార్డ్నెర్ (7), క్యాథరిన్ బ్రైస్ (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో సోఫియా 3, రేణుక రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 12.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 రన్స్ కొట్టింది. ఓపెనర్ స్మృతి మంధన (27 బంతుల్లో 43; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సబ్బినేని మేఘన (36 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రేణుకకు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా బుధవారం యూపీతో ముంబై తలపడనుంది.