WPL : భారత మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ మళ్లీ మైదానంలో కనిపించనుంది. అయితే.. ఈసారి కొత్త బాధ్యతల్లో ఆమెను చూడబోతున్నాం. మహిళల ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ మెంటార్, అడ్వైజర్గా మిథాలీ సేవలు అందించనుంది. తనను మెంటార్గా నియమించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ‘మహిళల ప్రీమియర్ లీగ్ అనేది మహిళల క్రికెట్ దశను మార్చే టోర్నీ. చారిత్రాత్మక టోర్నమెంట్లో గుజరాత్ టైటాన్స్కు మెంటర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రణవ్ అదానీకి ధన్యవాదాలు. జట్టుతో కలిసేందుకు ఆతృతగా ఉన్నాను’ అని మిథాలీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. భారత క్రికెట్కు గుర్తింపు తీసుకొచ్చిన మిథాలీ రాజ్ 2022 జూన్లోఅంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పింది. దాదాపు రెండు దశాబ్దాలు ఆడిన ఆమె అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం భావించింది. అదానీ స్పోర్ట్స్లైన్ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టును కొనుగోలు చేసింది. ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ ప్రీమియర్ లీగ్ వేలం జరగనుంది. మార్చిలో టోర్నీ ప్రారంభం కానుంది.
ఈమధ్యే మహిళా క్రికెటర్లకు కూడా పురుషుల జట్టుతో సమానమైన వేతనాన్ని బీసీసీఐ ప్రకటించింది. ఉమెన్ క్రికెట్కు వైభవం తేవడం కోసం బీసీసీఐ తొలిసారిగా మహిళల ప్రీమియర్ లీగ్కు శ్రీకారం చుట్టింది. పురుషుల ఐపీఎల్ ఎందరో క్రికెటర్ల జీవితాల్ని మార్చేసింది. ఈ టోర్నీతో ఇప్పుడు మహిళా క్రికెటర్ల లైఫ్ కూడా టర్న్ కాబోతోంది. డబ్ల్యూపీఎల్ ద్వారా యంగ్స్టర్స్ జాతీయ జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంది.
The Women’s Premier League will be the biggest game-changer women’s cricket has seen. Thank you so much @PranavAdani for this wonderful opportunity to mentor a side in the inaugural edition of this historic tournament. Can’t wait to get started! 🏏 #WPL https://t.co/2RwSu2GgI2
— Mithali Raj (@M_Raj03) January 28, 2023