WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ 19 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అద్భుత విజయం సాధించింది. ఆడిన ఐదు మ్యాచ్లో గుజరాత్కు ఇది తొలి విజయం. మొదట బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 199-5 స్కోరు చేసింది.
కెప్టెన్ బేత్ మూనీ(51 బంతుల్లో 85 నాటౌట్, 12ఫోర్లు, సిక్స్), లౌరా వాల్వర్డ్ (45 బంతుల్లో 76, 13ఫోర్లు) ధనాధన్ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. మిలోనెక్స్, వేర్హామ్ ఒక్కో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన ఆర్సీబీ 180-8 స్కోరు చేసింది. వేర్హామ్ (48) రీచా ఘోష్ (30) ఫర్వాలేదనిపించారు. గార్డ్నర్ (2-23) రెండు వికెట్లు తీసింది. బేత్మూనీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.