WPL 2024, GG vs RCB | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో తొలి విజయానికి తహతహలాడుతున్న గుజరాత్ జెయింట్స్ ఆ దిశగా ఒక అంకాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తో ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ మునుపెన్నడూ లేనివిధంగా దంచికొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ జట్టు కెప్టెన్ బెత్ మూనీ (51 బంతుల్లో 85 నాటౌట్, 12 ఫోర్లు, 1 సిక్సర్), లారా వోల్వార్డ్ట్ (45 బంతుల్లో 76, 13 ఫోర్లు) చెలరేగి ఆడారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు వచ్చిన గుజరాత్ ఆది నుంచే ధాటిగా ఆడింది. వోల్వార్డ్ట్ – మూనీలు తొలి వికెట్కు ఏకంగా 140 పరుగులు జోడించారు. డబ్ల్యూపీఎల్ లో ఏ వికెట్కు అయినా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. గత సీజన్లో ఢిల్లీ ఓపెనర్లు షఫాలీ వర్మ – మెగ్ లానింగ్లు ఇదే ఆర్సీబీతో మ్యాచ్లో 162 పరుగులు జోడించారు. తాజాగా లారా-మూనీలు 140 పరుగులు జతచేశారు. ఇద్దరూ కలిసి ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశారు. అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించడంతో గుజరాత్కు ఘనమైన ఆరంభం దక్కింది. ఏ వికెట్కు అయినా గుజరాత్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
32 బంతుల్లోనే వొల్వార్డ్ట్ అర్థ సెంచరీ పూర్తిచేసుకోగా 33 బంతుల్లో మూనీ హాఫ్ సెంచరీ పూర్తయింది. మూనీ హాఫ్ సెంచరీ తర్వాత సమన్వయ లోపం కారణంగా లారా రనౌట్ అయినా ఆ తర్వాత మూనీ వీరవిహారం చేసింది. లారా – మూనీల ధాటికి ఆర్సీబీ బౌలర్లు భారీగా పరగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఏడుగురు బౌలర్లను ఉపయోగించగా.. అందులో నలుగురు బౌలర్ల ఎకానమీ 10 దాటగా మిగిలిన ముగ్గురువి 8 కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు (ఆర్సీబీతో ప్రస్తుత మ్యాచ్ కాకుండా) నాలుగు మ్యాచ్లు ఆడి నాలుగింటిలో ఓడిన గుజరాత్కు ఈ మ్యాచ్లో గెలవడం అత్యావశ్యకం. ఈ మ్యాచ్లో ఓడితే ఆ జట్టు ప్లేఆఫ్ ఆశలను వదిలేసుకున్నట్టే.. కాగా, కీలక మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు సాధించడం గమనార్హం.