WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ వారియర్స్ బౌలర్లు రాణించారు. గుజరాత్ జెయింట్స్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ను 152 పరుగులకే పరిమితం చేశారు. గుజరాత్ జట్టులో బెత్ మూనీ (52 బంతుల్లో 74 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగి ఆడగా లారా వోల్వార్డ్ట్ (30 బంతుల్లో 43, 8 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది. ఫలితంగా గుజరాత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్స్టోన్ మూడు వికెట్లు తీయగా దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్కు శుభారంభమే దక్కింది. లారా – మూనీలు తొలి వికెట్కు 7.5 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ వేగంగా ఆడటంతో గుజరాత్ స్కోరు వేగంగా దూసుకెళ్లింది. కానీ ఎకిల్స్టోన్ గుజరాత్కు తొలి షాకిచ్చింది. లారాను ఔట్ చేసి గుజరాత్ వికెట్ల పతనానిని నాంది పలికింది. ఆ తర్వాత వచ్చిన వాళ్లెవరూ 20 పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు.
21 Runs in the final over have helped Gujarat Giants post a competitive 152 on board.
UP Warriorz need 153 Runs to keep their playoff hope alive.#CricketTwitter #WPL2024 #UPWvGG pic.twitter.com/1U9GzybAvo
— Female Cricket (@imfemalecricket) March 11, 2024
ఒకవైపు వికెట్లు పడుతున్నా బెత్ మూనీ ఆఖరిదాకా క్రీజులో ఉండి గుజరాత్కు పోరాడే స్కోరును అందించింది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే యూపీకి ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి. మరి యూపీ బ్యాటర్లు కీలక మ్యాచ్లో రాణిస్తారా లేక గత మ్యాచ్ల మాదిరిగానే చేతులెత్తేస్తారా..?