WPL 2024, DC vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు కీలక మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఇరుజట్లకూ నేటి పోరు కీలకమే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న నేటి మ్యాచ్లో మెగ్ లానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ ఫీల్డింగ్ చేయనుంది. టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లతో పాటు బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా రావడం ప్రేక్షకులను అలరించింది.
రెండో సీజన్లో ఏడు మ్యాచ్లు ఆడి ఇప్పటికే ఐదింటిలో నెగ్గిన ముంబై ఇండియన్స్.. 10 పాయింట్లతో అగ్రస్థానంతో పాటు ప్లేఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంది. కాగా ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు నెగ్గి రెండింట్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే ఢిల్లీ ప్లేఆఫ్స్ బెర్త్తో పాటు తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంటుంది. ముంబై కంటే ఢిల్లీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణం.
Bollywood actress Kareena Kapoor Khan is in attendance for the DC women Vs RCB women clash at the Arun Jaitley Stadium 🔥
📸:- Jio Cinema#KareenaKapoor #DCvRCB #WPL2024 #Insidesport #CricketTwitter pic.twitter.com/yo7kaQIoYP
— InsideSport (@InsideSportIND) March 10, 2024
ఇక ఆరు మ్యాచ్లలో మూడు గెలిచి మూడింట ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్లో గెలవడం ఆ జట్టుకు అత్యంత కీలకం. నేడు ఢిల్లీని ఓడిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ ప్లేస్ దాదాపు కన్ఫమ్ అయినట్టే. అదీగాక ఆర్సీబీ మరో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్లో ఓడితే ఆర్సీబీ ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి.