తుంటి నొప్పి… ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. గతంతో పోలిస్తే కరోనా వైరస్ వచ్చిపోయిన తరువాత తుంటి నొప్పి బాధితుల సంఖ్య పెరిగిందంటున్నారు వైద్య నిపుణులు. కారణం వైరస్కు గురై, కోలుకున్న తరువాత రక్త సరఫరాలో అవరోధాలు ఏర్పడటమే. ఈ విధంగా రక్త ప్రసరణ మందగించడం వల్ల తలెత్తే తుంటి సమస్యను వైద్య పరిభాషలో ‘ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్’ అంటారు. ఈ వ్యాధి ముందు నుంచే ఉన్నప్పటికీ కరోనాతరువాత బాధితుల సంఖ్య 20 శాతం పెరిగినట్టు చెబుతున్నారు వైద్యులు. ఈవ్యాధి రావడానికి ప్రధాన కారణాలేంటి? దీనివల్ల రోగికి కలిగే ఆరోగ్య సమస్యలు, నిర్ధారించే పద్ధతులు, వ్యాధి లక్షణాలు, చికిత్స తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
సాధారణంగా శరీరంలోని ఏ అవయవానికైనా పైనుంచి కిందికి రక్త సరఫరా జరుగుతుంది. కానీ తుంటి భాగానికి మాత్రం కింది నుంచి పైకి రక్తం సరఫరా జరుగుతుంది. దీనివల్ల ఇతర భాగాలతో పోలిస్తే తుంటి ఎముకకు రక్తం సరఫరా మందగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే తుంటి కీలు హిప్ జాయింట్కు రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుంది. ఫలితంగా తుంటి కీలులోని ఎముక కణాలు క్రమంగా నశిస్తాయి. ఇవి పూర్తిగా నశిస్తే.. అక్కడున్న ఎముక కుళ్లిపోతుంది. ఇలా ఎముక కుళ్లిపోవడాన్నే వైద్య పరిభాషలో ‘ఎవాస్కులర్ నెక్రోసిస్’ అంటారు. దీనివల్ల రోగి తీవ్రమైన తుంటి నొప్పితో బాధపడతాడు. ఈ వ్యాధి సాధారణంగా నాలుగు దశల్లో ఉంటుంది.
మొదటి దశలో…
తొలి దశలో ఎముకలోని కణాలు నశించడం ప్రారంభమవుతుంది. దీంతో తుంటి నొప్పి మొదలవుతుంది. ఆరు వారాల్లో నొప్పి తగ్గకపోతే ఎంఆర్ఐ చేయించాల్సి ఉంటుంది. ఈ దశలో ఎంఆర్ఐ పరీక్షతో వ్యాధిని నిర్ధారించవచ్చు. మొదటి దశలోనే వ్యాధిని గుర్తించడం వల్ల సాధారణ చికిత్సతోనే రోగికి వ్యాధి ముదరకుండా జాగ్రత్త పడవచ్చు.
రెండో దశ
దీనిని ప్రీ కొలాప్స్ దశ అంటారు. ఈ దశలో కార్టిలేజ్కు సపోర్ట్గా ఉన్న ఎముక 25 శాతం నుంచి 50 శాతం వరకు దెబ్బతింటుంది. రోగిలో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. రెండో దశలో వ్యాధిని గుర్తిస్తే శస్త్రచికిత్స అవసరం లేకుండానే మాత్రలతో వ్యాధిని నయం చేయవచ్చు. మొదటి రెండు దశల్లో వ్యాధిని గుర్తిస్తే సాధారణ చికిత్స ద్వారా ఎముక కుళ్లిపోవడం (బోన్డెత్) నుంచి రోగికి విముక్తి కల్పించవచ్చు.
మూడో దశ
మూడో దశను కొలాప్స్ దశ అనికూడా అంటారు. ఈ దశలో తుంటి కీలులోని ఎముక 50 శాతం నుంచి 75 శాతం వరకు అరిగిపోతుంది. ఈ దశలో రోగి భరించలేని నొప్పితో బాధపడతాడు. లేచి నిలబడలేడు. నడవలేడు. నొప్పి కారణంగా నిద్ర పట్టదు.
నాలుగో దశ
ఈ దశలో తుంటి ఎముక పూర్తిగా దెబ్బతిని, కప్ సైడ్ కూడా అరుగుదల మొదలవుతుంది. నాలుగో దశను ఆర్థరైటిస్ స్టేజ్ అంటారు. ఈ దశలో రోగి తుంటి కీలు ఎముక పూర్తిగా కుళ్లిపోతుంది. దీనివల్ల తుంటి కీళ్లు పనిచేయవు. దీంతో రోగి తీవ్రమైన నొప్పితో బాధపడతాడు. ఒకచోటు నుంచి మరోచోటుకు నడవడం సాధ్యపడదు. ఏదైనా వస్తువును తీసుకోవాలంటే వంగలేని పరిస్థితి. వీల్చైర్పైనే ఉండాల్సిన దుస్థితి నెలకొంటుంది. మూడు నాలుగు దశల్లో రోగి తుంటి నొప్పి నుంచి కోలుకోవాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం. అంటే తుంటి కీలు మార్పిడి చేయాల్సి వస్తుంది.
లక్షణాలు
నిర్ధారణ పద్ధతులు
జాగ్రత్తలు
చికిత్సా పద్ధతులు
మొదటి రెండు దశల్లో సాధారణ ఔషధాలతోనే చికిత్స చేయవచ్చు. ముందుగా రోగి ఆరోగ్య చరిత్ర తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే రోగి స్టెరాయిడ్స్ వాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ స్టెరాయిడ్స్ వాడుతుంటే వెంటనే వాటిని నిలిపివేయాలి. షుగర్, బీపీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వాటిని నియంత్రణలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ధూమపానం, మద్యపానం అలవాట్లను మాన్పించడం లేదా తగ్గించడం చేయాలి. క్రమం తప్పకుండా ఫిజియో థెరపీ అవసరమవుతుంది. ‘బై ఫాస్ఫోనేట్’ మాత్రలను మూడు నెలలపాటు వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. వీటితోపాటు కాల్షియం, డి-విటమిన్ కూడా తీసుకోవాలి. ఒకవేళ రెండోదైన ప్రీ కొలాప్స్ స్టేజ్లో నొప్పి తీవ్రంగా ఉంటే కోర్ డి-కంప్రెషన్, కోర్ డి-కంప్రెషన్తోపాటు ఎముక మూలుగ (బోన్ మ్యారో) చికిత్సకు వెళ్లాలి. అయితే లోకల్ పీఆర్పీ ఇంజెక్షన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. ఇక మూడో దశ అయిన కొలాప్స్ దశ, నాలుగో దశలో ఉన్న రోగులకు మాత్రం పూర్తిగా తుంటి ఎముక మార్చడం ఒక్కటే మార్గం.
వ్యాధికి ప్రధాన కారణాలు
..?మహేశ్వర్రావు బండారి
డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి
ఆర్థోపెడిక్ సర్జన్,
తుంటి మార్పిడి నిపుణులు,
స్టార్ హాస్పిటల్, హైదరాబాద్