WPL 2024 | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో యూపీ వారియర్స్ జట్టుతో సోమవారం జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. యూపీ వారియర్స్ నిర్దేశించిన 120 పరుగుల విజయ లక్ష్యాన్ని 14.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ 51 పరుగులుచేసి సోఫీ ఎకెల్ స్టోన్ బౌలింగ్ లో వ్రుందా చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టారు. షఫాలీ వర్మ 64 పరుగులు, జెమ్మిమాహ్ రోడ్రిగ్స్ నాలుగు పరుగులతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ సోఫీ ఎకెల్ స్టోన్ ఒక వికెట్ తీశారు. యూపీ వారియర్స్ 119 పరుగులు చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ కోల్పోయి 123 పరుగులు చేసింది.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి యూపీ వారియర్స్ తట్టుకోలేక చేతులెత్తేశారు. శ్వేతా పెహ్రావాత్ 45, గ్రేస్ హారిస్ 17, ఎలీసా హీలే 13 మినహా మిగతా బ్యాటర్లు 10 పరుగుల కంటే ఎక్కువ చేయలేదు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు, మారిజాన్ కాప్ మూడు, అరుంధతి రెడ్డి, అనాబెల్ సదర్లాండ్ చెరో వికెట్ తీశారు.