డర్బన్ : ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత మహిళా పాడ్లర్ మనిక బత్రా పోరు ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో 39వ ర్యాంకర్ మనిక 11-6, 10-12, 9-11, 11-6, 11-13, 11-9, 3-11తో 13వ ర్యాంకర్ ఆడ్రియాన డయాజ్(ప్యూర్టోరిక) చేతిలో పోరాడి ఓడింది. ఆరో గేమ్ వరకు ఇరువురూ హోరాహోరీ పోరాడారు. ఏడో గేమ్లోనూ 3-3తో సమంగా నిలిచారు.
ఆ తరువాత డయాజ్ గేర్ మార్చి, స్పీడ్ పెంచి గేమ్తోపాటు, మ్యాచ్ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్లో మనిక-అర్చన జోడీ ఓటమిపాలైంది.