Mohammad Hussamuddin | బుస్టో అర్సిజియో(ఇటలీ): వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీలో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్కు నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన పురుషుల 57కిలోల బౌట్లో హుసామ్ 0-4 తేడాతో జ్యూడ్ గాల్గర్(ఐర్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. గాయం నుంచి తేరుకుని బరిలోకి దిగిన ఈ ఇందూరు బాక్సర్ స్థాయికి ఆటతీరు ప్రదర్శించడంలో విఫలమయ్యాడు.
టోర్నీ తొలి రౌండ్లో బై అందుకున్న హుసామ్ ముందంజ వేయలేకపోయాడు. 2023 ప్రపంచ చాంపియన్షిప్ తర్వాత పోటీకి దిగిన ఈ యువ బాక్సర్..ప్రత్యర్థి బాక్సర్కు దీటైన పోటీనివ్వలేకపోయాడు. బర్మింగ్హామ్ కామన్వెల్త్ విజేత అయిన గాల్గర్ దూకుడు ప్రదర్శిస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీలో భారత్ తరఫున తొమ్మిది మంది బాక్సర్లు పోటీకి దిగగా, నిశాంత్దేవ్(71కి) ఒక్కడే ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు.