ODI WC 2023 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్(ODI WC 2023) సమరానికి నెలన్నర రోజులే ఉంది. దాంతో, ఈ టోర్నీ ప్రచారాన్ని ఐసీసీ(ICC) వేగవంతం చేసింది. కొన్నిరోజులుగా ప్రపంచాన్ని చుట్టొస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీ ఈరోజు ప్యారిస్లో తళుక్కుమంది. చారిత్రక నిర్మాణమైన ఈఫిల్ టవర్(Eiffle Tower) ముందు ఠీవీగా కొలువుదీరింది. ఆ ఫొటోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈఫిల్ టవర్ దగ్గర ఉన్న సందర్శకులు ప్రపంచ కప్ ట్రోఫీని చూసి మస్త్ ఖుషీ అవుతున్నారు.
ఈ ఏడాది భారత గడ్డపై ప్రపంచ కప్ జరుగనుంది. ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ పోరుతో టోర్నీ ఆరంభం కానుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే..? ఫైనల్తో పాటు సెమీఫైనల్ మ్యాచ్లకు కూడా రిజర్వ్ డేను కేటాయించారు. ఇప్పటికే ప్రపంచ కప్ టికెట్ల అమ్మకాల తేదీలను ఐసీసీ విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయి. అయితే… భారత జట్టు మ్యాచ్ టికెట్లు మాత్రం ఆగస్టు 30 నుంచి అమ్ముతారు.
Making its presence felt in the City of Love ❤️
The ICC Men’s Cricket World Cup Trophy visits the Eiffel Tower in Paris 🤩📸#CWC23 pic.twitter.com/aybqOCT4r1
— ICC (@ICC) August 21, 2023
సొంతగడ్డపై 2011లో వరల్డ్ కప్ అందుకున్న టీమిండియా ఈసారి టైటిల్పై గురి పెట్టింది. ఆసియా కప్ పోటీలకు ప్రకటించిన స్క్వాడ్లో కేఎల్ రాహుల్(KL Rahul), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) చోటు దక్కించుకున్నారు. వీళ్లిద్దరి రాకతో మిడిలార్డర్ బలంగా కనిపిస్తోంది. అంతేకాదు స్పీడ్స్టర్ బుమ్రా కూడా ఫామ్ అందుకున్నాడు. సీనియర్ల రాకతో టీమిండియా ఈసారి ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.