న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ బాక్సింగ్ ట్రయల్స్లో ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ జోరు కనబరుస్తున్నది. ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా గురువారం మొదలైన ట్రయల్స్లో అదిరిపోయే బోణీ కొట్టింది. మహిళల 50కిలోల విభాగం తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో సవిత(హర్యానా)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే జోరు కనబరిచిన ఈ యువ బాక్సర్ ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా చెలరేగింది.శుక్ర, శనివారాల్లో జరిగే సెమీఫైనల్, ఫైనల్ బౌట్లలో సత్తాచాటి బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్కు బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఈ ఇందూరు బాక్సర్ కనిపిస్తున్నది.