హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ భాగమైంది. మంగళవారం జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో నిఖత్ మొక్క నాటింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకు ఎలాంటి కలుషితం లేని వాతావరణం కావాలంటే.. ప్రతి ఒక్కరూ గ్రీన్ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలి’ అని పిలుపునిచ్చింది.