కోపెన్హగన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ శుభారంభం చేయగా.. కిడాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. సోమవారం పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రణయ్ 24-22, 21-10తో కాలే కొల్జోనెన్ (ఫిన్లాండ్)పై విజయం సాధించాడు.
మరో మ్యాచ్లో లక్ష్యసేన్ 21-12, 21-7తో జార్జ్ జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచాడు. శ్రీకాంత్ 14-21, 14-21తో కెంటా నిషిమోటో చేతిలో ఓడాడు.