సౌత్ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ట్యాబ్స్ను భారత్లో విడుదల చేసింది.
గెలాక్సీ ట్యాబ్ S7 FE, గెలాక్సీ ట్యాబ్ A7లైట్ మోడళ్లను ఇవాళ ఆవిష్కరించింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్7 లైనప్లో భాగంగా ట్యాబ్ S7 FEని తీసుకొచ్చింది. ట్యాబ్ ఎస్7, ట్యాబ్ ఎస్7+ కూడా ఇందులో ఉన్నాయి. గెలాక్సీ ట్యాబ్ ఏ7కు కొనసాగింపుగా A7 లైట్ను రిలీజ్ చేసింది.
గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఇ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .46,999కాగా 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .50,999గా నిర్ణయించారు.
గెలాక్సీ టాబ్ ఎ7 లైట్ ఒక స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే వస్తోంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన LTE మోడల్ ధర రూ .14,999 కాగా WiFi మోడల్ ధర రూ .11,999గా ఉంది. ఈ రెండు ట్యాబ్లు జూన్ 23 నుంచి శాంసంగ్.కామ్, శాంసంగ్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్, ప్రముఖ ఆన్లైన్, ఆఫ్లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.