మహిళల ప్రపంచకప్లో ఆస్ట్రేలియా మహిళలు చరిత్ర సృష్టించారు. అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించారు. శనివారం నాడు భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో ఆసీస్ జట్టు సెమీస్ చేరడం ఖాయమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన్ ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్కు శుభారంభం దక్కలేదు.
ఓపెనర్లు స్మృతి మంధాన (10), షెఫాలీ వర్మ (12) నిరాశపరిచారు. అయితే యాస్తికా భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్ (68), హర్మన్ప్రీత్ కౌర్ (57 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత రిచా ఘోష్ (8), స్నేహ్ రాణా (0) నిరాశపరిచినా.. పూజా వస్త్రాకర్ (34) చివర్లో మెరుపులు మెరిపించింది. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 277/7 స్కోరు సాధించింది.
భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు రచెల్ హేనెస్ (43), అలిస్సా హేలీ (72) అద్భుతమైన ఆరంభం అందించారు. ఈ జోడీని వస్త్రాకర్ విడగొట్టింది. ఆమె బౌలింగ్లో రచెల్ అవుటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది.
ఎలిసీ పెర్రీ (51 బంతుల్లో 28) టెస్టు తరహా బ్యాటింగ్ కనబరిచినా.. చివర్లో బెథ్ మూనీ (30) నాలుగు ఫోర్లతో జట్టును విజయానికి చేర్చింది. భారత బౌలర్లలో వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టగా.. స్నేహ్ రాణా, మేఘనా సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఆసీస్ జట్టు మరో మూడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
Australia complete the highest successful run-chase in ICC Women’s @cricketworldcup history 🎉 pic.twitter.com/9Cv2JLGja5
— ICC (@ICC) March 19, 2022
With 10 points on the board, Australia have officially sealed a spot in the #CWC22 semi-finals 🌟 pic.twitter.com/2DJ6C2dnc0
— ICC (@ICC) March 19, 2022