హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరు వేదికగా జరుగుతున్న మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సింగిల్స్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్లో రష్మిక 6-1, 6-4తో వైష్ణవిపై అలవోక విజయం సాధించింది.
ఆది నుంచే తనదైన దూకుడు కొనసాగించిన రష్మిక.. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా వరుస సెట్లలో మ్యాచ్ను తన వశం చేసుకుంది. మహిళల డబుల్స్లో రష్మిక, వైదేహి చౌదరీ ద్వయం 6-0, 0-6, 3-10తో ఇటలీ జోడీ చెరుబిని, స్కిమిత్ చేతిలో ఓడింది.