ఆక్లాండ్: మహిళల ప్రపంచకప్ (Women’s World Cup) ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతున్నది. మొదటి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన ఆరంభంలో తడబడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడారు. దీంతో ఆస్ట్రేలియాకు 278 పరుగుల విజయలక్ష్యాన్ని విధించారు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే రెండు కోల్పోయిన జట్టును కెప్టెన్ మిథాలీ రాజ్ (68), యస్తికా భాత్రా (59) ఆదుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు.
యస్తికా ఔటౌన తర్వాత క్రీజ్లోకి వచ్చిన వైస్కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (57) నాటౌట్గా నిలిచింది. చివర్లో వచ్చిన పూజా వస్త్రకార్ (34) ధాటిగా ఆడటంతో జట్టు స్కోరు 50 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 277 పరుగుల చేసింది.
Innings Break!
Solid show by #TeamIndia to post 2⃣7⃣7⃣/7⃣ on the board! 👏 👏 #CWC22 | #INDvAUS
6⃣8⃣ for captain @M_Raj03
5⃣9⃣ for @YastikaBhatia
5⃣7⃣* for vice-captain @ImHarmanpreet
3⃣4⃣ for @Vastrakarp25Over to our bowlers now. 👍
Scorecard ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/EAqhkwqL4O
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
అయితే 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ బ్యాటర్లు దాటిగా ఆడుతున్నారు. పది ఓవర్లు ముగిసే సరికి 70 పరుగులు చేశారు.