ఆక్లాండ్: మహిళల ప్రపంచకప్లో (Women’s World Cup) భాగంగా ఆస్ట్రేలియాతో మిథాలీ సేన తలపడుతున్నది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా.. తడబడుతున్నది. టోర్నీలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టాప్ఆర్డర్ మరోసారి విఫలమయింది. జట్టు స్కోర్ 11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్లో ఉన్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (11 బాల్స్ 10 రన్స్) మూడో ఓవర్లో క్యాచౌట్ అయింది.
యువ సంచలనం షఫాలీ వర్మా ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఐదో ఓవర్లోనే వికెట్ సమర్పించుకున్నది. 12 పరుగులు చేసిన షఫాలీ.. బ్రౌన్ బౌలింగ్లో వెనుతిరిగింది. దీంతో ఏడు ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి టీమ్ఇండియా 33 పరుగులు చేసింది. ప్రస్తుతం మిథాలీ రాజ్ (5 బాల్స్ 1 రన్), యస్తికా భాటియా (13 బాల్స్ 5 రన్స్) క్రీజులో ఉన్నారు.